ADB: గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే మంజూరుతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ.5 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు ప్రజలకు సౌకర్యాన్ని కల్పించనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.