KNR: ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రావణ్ కుమార్, సిబ్బంది, రోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్ మాట్లాడుతూ.. 2 వారాలకు మించి దగ్గు, బరువు తగ్గడం, రాత్రి పూట చెమటలు వస్తే ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.