AP: విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 25 వేల మంది గిరిజన విద్యార్థులతో గిన్నిస్ బుక్ రికార్డుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సంధ్యారాణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.