PDPL: పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచేలా విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శుక్రవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను సీపీ తనిఖీ చేశారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కర్ణాకర్, ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ పాల్గొన్నారు.