ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన బ్యాటింగ్తో మెరిశాడు. బౌలర్లపై చెలరేగి 144 బంతుల్లో మొత్తం 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది సూపర్ సెంచరీ చేశాడు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనూ సెంచరీతో మెరిసిన జైశ్వాల్.. ఇంగ్లండ్ గడ్డపై అదే ఫీట్ నమోదు చేశాడు.