SRD: ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు కలెక్టర్ ప్రావీణ్య సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున, విత్తనాలు, ఎరువులను లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ప్యాకింగ్ తేదీ, గడువు ముగిసే తేదీని పరిశీలించి తీసుకోవాలన్నారు. పత్తి విత్తనాల గరిష్ట ధర రూ. 901 అని, అంతకంటే ఎక్కువ చెల్లించొద్దని సూచించారు.