SRD: పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ శుక్రవారం డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అర్హులందరికీ రైతు భరోసా నిధులు జమ అయ్యేలా చూడాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.