CTR: జిల్లాలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్టుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. జిల్లాకు తొలి విడతగా 26,370 క్వింటాళ్ల విత్తనాలు రాగా.. 83,068 మంది రైతులకు వాటిని అందజేశామన్నారు. మరో 13 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలు వచ్చాయని, వాటిని కూడా రైతులకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.