W.G: తాడేపల్లిగూడెం(మం) కొమ్ముగూడెం, పట్టింపాలెం, బంగారుగూడెం గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు వారి ఖాతాల్లో జమయ్యాయా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు, అవసరాలు తెలుసుకుంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.