KDP: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు పేర్కొన్నారు. మంగళవారం సిద్ధవటం మండలం మాధవరం-1లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్రుడు మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.