TG: కాలుష్యాన్ని అరికట్టేందుకే EV పాలసీ తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2026 వరకు జీరో రిజిస్ట్రేషన్ ఫీ విధానం అమలు చేస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్పై ఎలక్ట్రిక్ వాహనాలు అందించనున్నట్లు ప్రకటించారు. 10 – 20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ ఆటోలు, బస్సలను తీసుకొస్తున్నామన్నారు.