MLG: స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని యువత అన్ని రంగాల్లో ఎదగాలని మున్సిపల్ ఛైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. సోమవారం ములుగు పట్టణంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఎ, డీవైఎఫ్ఎ, సీఐటీయూ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేయగా ఛైర్పర్సన్ వారిని అభినందించారు.