MBNR: హన్వాడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను (కేజీబీవీ) డీఈవో సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతులు, శుభ్రత, ఆహార నాణ్యత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.