BDK : కొత్తగూడెం జిల్లా రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక సాంకేతికత మరియు శాస్త్రీయ విధానాలతో దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. పంట మార్పిడి, పశుసంవర్ధక రంగంపై దృష్టి సారించి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు.