MHBD: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారుల వినతులను సవివరంగా విని సంబంధిత విభాగాల అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.