పార్వతీపురం నెల్లి చెరువులో నిర్మాణాల లెక్కలు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు వంగల దాలినాయుడు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు DRO కె. హేమలతకు వినతి పత్రాలు అందజేశారు.