ASR: నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఎస్.శ్రీనివాసరావు, ఐసీఆర్పీ ఎస్.వరలక్ష్మి తెలిపారు. కొయ్యూరు మండలం గింజర్తిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు.