MDK: మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద భవనం పైనుంచి పడి ఒడిస్సా కార్మికుడు జ్యోతి రంజన్ (36) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం రాత్రి భవనం పైకి ఎక్కగా కాలుజారి కింద పడ్డట్టు తెలిపారు. చికిత్స కోసం తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.