NTR: తిరువూరు లక్ష్మీపురం పాక్స్ పరిధిలోని రైతులకు సొసైటీ అధ్యక్షురాలు ప్రమీల చేతుల మీదుగా రూ. కోటి విలువైన ‘రైతు నేస్తం’ చెక్కులను అందజేశారు. గేదెలు, గొర్రెలు కొనుగోలు నిమిత్తం ఈ దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు సొసైటీ ద్వారా రూ. 8.25 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, రూ. 1.22 కోట్ల పంట రుణాలు రైతులకు అందించినట్లు ఆమె తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు.