VSP: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి జనగణన-2027 ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ పనులు పూర్తి చేయాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో వేగవంతంగా, పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.