NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విషాదం నెలకొంది. తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న గొడుగు గోవర్ధనగిరి గుండెపోటుతో మృతి చెందారు. ఇవాళ్ల ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. అడవి దేవులపల్లి గ్రామానికి చెందిన ఆయన ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.