SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఎస్పీ కె. నరసింహ బాధితుల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను చట్టపరంగా, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు అండగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడడమే తమ ప్రాధాన్యతని ఆయన అన్నారు