NTR: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ ఇలక్కియ కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 112 అర్జీలు అందగా, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.