NRPT: అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామిరెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం అమలు చేస్తూ బడ్జెట్ సమావేశంలో తీర్మానించాలని డిమాండ్ చేశారు.