విజయనగరం పట్టణంలోని ఓ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రెడ్డి సీతారాం అనే యువకుడికి సుమారు రెండు తులాల బంగారు బ్రాస్లెట్ నిన్న సాయంత్రం దొరికింది. సదరు యువకుడు క్షణం కూడా ఆలోచించకుండా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో బ్రాస్లెట్ను అప్పగించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు యువకుడి నిజాయితీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.