చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ‘PGRS’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.