కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు ఆదివారం సాయంత్రం పాల్వంచ మండలం అరేపల్లి గ్రామ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. సింగరాయపల్లి గ్రామానికి చెందిన చెన్నం నారాయణరెడ్డి అనే వ్యక్తి అరేపల్లి వాగు నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు చేశారు.