WGL: అవసరమైన సమయంలో ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం పేదలకు పెద్ద ఊరటగా నిలుస్తుందని TPCC సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి తెలిపారు. ఇవాళ నెక్కొండ పట్టణానికి చెందిన సయ్యద్ అజీముల్లాకు మంజూరైన రూ.17,500 విలువగల చెక్కును పంపిణీ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.