TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ‘తపసుపల్లి నుంచి కొండపాకకు నీళ్లు అందించాలి. దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. మల్లన్న సాగర్ భూములు ఇచ్చిన చాలా మంది రైతులకు ఇంకా పరిహారం అందలేదు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన దుబ్బాకకు సాగునీరు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.