VZM: గరివిడిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడి వేడిగా సాగింది. ఎంపీడీవో సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యూరియాపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అధిక ధరలకు ప్రైవేట్ షాపులు అమ్ముతున్నారని ఆరోపించారు.