RR: తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.22% నిధులు మాత్రమే కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ద్రోహం చేసిందని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు నామమాత్రపు కేటాయింపులతో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.