RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు అందిస్తుందని, ఇల్లు లేని నిరుపేదలకు ఇది గొప్ప అవకాశం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కళ్యాణి యాదగిరి పాల్గొన్నారు.