SDPT: గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇంఛార్జ్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో పామాయిల్ సాగు, సంబంధిత ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నర్మెటలో ఏర్పాటు చేసిన భారీ పామాయిల్ ఫ్యాక్టరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావుల కృషితో పూర్తైన ఫ్యాక్టరీని నేడు కాంగ్రెస్ చేసినట్లు కలర్ ఇస్తుందన్నారు.