E.G: రాజమండ్రి 45వ డివిజన్ ఎస్ఎస్ఆర్ లేఅవుట్ శివాలయం ప్రాంతంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.