GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడ భాస్కరరావు ఆదివారం రూ. 50 వేల విరాళం అందజేశారు. ఆలయ ఉపకమిషనర్ లీలా కుమార్, పాలక మండలి ఛైర్మన్ పూర్ణచందర్రావు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానానికి భక్తులు విరాళాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. దాతకు ప్రత్యేక దర్శనం, శేషవస్త్రంతో సత్కరించారు.