BPT: సంతమాగులూరు మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేవూరి వాసిరెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇకపై కూడా రవికుమార్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని, కూటమిని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని నాయకులు సంకల్పించారు.