WNP: ఈనెల 23న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు డీ.నారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను వంచిస్తోందని, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన కోరారు.