VZM: మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం, మహేంద్ర హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరంలో ఆదివారం మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది యువకులు స్వచంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.