BHPL: గంగారం క్రాస్ రోడ్డు కొయ్యూరులో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, BRS రాష్ట్ర నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.