KKD: రాష్ట్ర యువత ఉజ్వల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. ఆదివారం కాకినాడ రూరల్ 48, 49 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.