అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగిన 104 ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా జట్టు ఘనవిజయం సాధించింది. అనంతపురం జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. గంగులప్ప 39 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నారు. బౌలింగ్లో విజయ్, నాగార్జున తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.