GNTR: జిల్లా ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ‘మీ కోసం’ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లాలో PGRS, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.