KMR: బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఆదివారం 7వ వార్డు బీజేపీ కౌన్సిలర్ మానస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, ఉన్నారు.