KMR: పిట్లం ఆర్యవైశ్య మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం “ఛలో భాగ్యనగర్” కార్యక్రమానికి పిలుపునిస్తూ ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలని నినదించారు. సమాజ అభివృద్ధికి ఐక్యతే బలమని, ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాలని వారు పేర్కొన్నారు.