SRD: జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 34.4 డిగ్రీలు, గుమ్మడిదలలో 33.2 డిగ్రీలు, అమీన్పూర్లో 33.7 డిగ్రీలు, రామచంద్రాపురంలో 33.7 డిగ్రీలు, పటాన్చెరులో 34.1 ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, గాలిలో తేమశాతం 43.4గా నమోదయింది.