KDP: ఖాజీపేట(M) నాగసానిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో DSP రాజేంద్ర ప్రసాద్, సీఐ వంశీధర్లు వివరాలు వెళ్లడించారు. 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పారిపోయినట్లు పేర్కొన్నారు.