KRNL: ఆదోని సుందరయ్య భవన్ నిర్మాణానికి కల్లుబావి ప్రాంతానికి చెందిన సీపీఎం మాజీ కౌన్సిలర్ పీ.ఎస్.ముత్తమ్మ రూ. 20 వేల విరాళం ఆదివారం అందజేశారు. ఈ మొత్తాన్ని సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్నకు, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్నతో పాటు నాయకులు కృష్ణమూర్తి, సమక్షంలో అందించారు. ముత్తమ్మ సహకారానికి సీపీఎం పట్టణ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.