WG: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఇవాళ ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా జరిగింది. నీటి సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజంటేషన్ పోటీలు నిర్వహించారు. నీరు జీవనాధారమని, ప్రతి ఒక్కరు వృథాను అరికట్టి జల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.