NLR: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గ్రంథాలయ పాలనాధికారి ఏ. నరసింహారావు అన్నారు. బుచ్చి శాఖ గ్రంధాలయంలో ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి పొదుపు నినాదంగా కాకుండా విధానంగా మారాలన్నారు. నీటి సంరక్షణపై బాల్యంలోనే పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు.