భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో గల డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో నెలకొన్న మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న గండ్ర ఆదివారం ఇళ్లను సందర్శించారు. కాంగ్రెస్ హయాంలో పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.